తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కలిపి 525 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 17 ఎంపీ నియోజకవర్గాల్లోని 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరగనుంది. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందిని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల ఎలా ఉంటాయని ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.