– ఫోన్ పే లో మహేశ్ గొంతు.. పేమెంట్ సక్సెస్
ప్రస్తుతం క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే కొనసాగుతున్నాయి. టీ స్టాల్ నుంచి షేర్ మార్కెట్ వరకు ఎక్కడ చూసినా డిజిటల్ కామెంట్లే కనిపిస్తున్నాయి. వీరిలో మరీ ముఖ్యంగా ఫోన్ పే వాడేవారి సంఖ్య అధికంగా ఉంటోంది. వినియోగదారులు ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత స్కాన్ చేసి పేమెంట్ చేస్తే.. యా స్పీకర్లలో.. డబ్బులు జమ అయినట్లు వాయిస్ వస్తుంది. ఇప్పటివరకు ఓ ఫీమేల్ వాయిస్ వినిపించేది. అయితే తాజాగా ఈ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇందులో వినిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని ఫోన్ పే స్పీకర్లలో మనీ రిసీవ్ వాయిస్ మహేశ్ బాబు ది రానున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి.. మహేష్ బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది.