Homeజిల్లా వార్తలుజూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్లారెడ్డి

జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్లారెడ్డి

ఇదే నిజం, కాశిబుగ్గ వరంగల్‌: తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (475) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్‌ నగరంలోని రంగషయ పేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ రెమిడీ మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ప్రిన్సిపాల్‌ శోభాదేవి ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేసి మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు.

Recent

- Advertisment -spot_img