ఇదే నిజం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన రుద్ర సత్తయ్య (46) అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని మృతి చెందాడు. సత్తయ్య కేబుల్ డిష్ కాంట్రాక్టు తీసుకొని ఆపరేటర్ గా పని చేసేవాడు. కేబుల్ డిష్ నష్టాల పాలవడంతో గ్రామంలో అప్పులు చేసినాడు. అట్టి అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై, జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు తన భార్య, పిల్లలు బయట పడుకుని ఉండగా ఇంట్లోకి వెళ్లి దూలానికి లుంగితో ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుని భార్య రుద్ర మంజుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్. ఉమా సాగర్ తెలిపారు.