Hyderabad : షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. 150 రూపాయలు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిశాకు చెందిన దింటూ సాహూ(24) బిష్ణుసావహక్ దంపతులు బతుకుదెరువు నిమిత్తం గతంలో హైదరాబాద్కు వచ్చారు. షామీర్పేట్ మజీద్పూర్లో కూలిపని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం తనకు 150 రూపాయలు ఇవ్వాలని భార్యను అడిగితే నిరాకరించింది తన భార్య. మనస్థాపానికి గురైన సాహూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.