Homeహైదరాబాద్latest Newsసంగారెడ్డిలో దారుణం

సంగారెడ్డిలో దారుణం

Sangareddy : సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా చూసి సాక్ష్యం చెప్పినందుకు.. 13 ఏళ్ల బాలుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత చేసిన నేరం ఒప్పుకుని అందరూ చూస్తుండగానే తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. జోగిపేటకు చెందిన నాగరాజు అనే యువకుడు దొంగతనం చేస్తుండగా శేఖర్ అనే 13 ఏళ్లు బాలుడు చూశాడు. దీంతో శేఖర్ మీద కక్ష పెంచుకున్న నాగరాజు.. నిన్న (ఏప్రిల్ 20) రాత్రి మాట్లాడాలని పిలిచి బాలుడిని హత్య చేసి బావిలో పడేశాడు. ఉదయం పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకున్నాడు. శేఖర్ మృతదేహాన్ని బావిలో పడేసిన విషయాన్ని కూడా పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి.. తనను చంపుతారని భయపడి.. నాగరాజు సెల్ టవర్ ఎక్కాడు. అడ్డుకోవడానికి వెళ్లిన మరో ఇద్దరిపై కూడా కత్తితో దాడి చేసి టవర్ ఎక్కాడు నాగరాజు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం నుంచి సెల్ టవర్‌పైనే ఉన్నాడు. టవర్‌పైనే ఓ కేబుల్ కట్ చేసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టవర్ మీద నిందితుడు ఉలుకు పలుకు లేకపోవడంతో డ్రోన్ కెమెరాతో నాగరాజు కదలికలు గమనించిన పోలీసులు.. చనిపోయాడని తెలుసుకుని మృతదేహాన్ని కిందికి దింపే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే నాగరాజు బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు.. బాలుడు శేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో.. గ్రామంలో విషాదఛాయలు అముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Recent

- Advertisment -spot_img