Homeహైదరాబాద్latest Newsకుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ఇదేనిజం, శేరిలింగంపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రలోని గుత్తికొండకు చెందిన దుమ్ము మాధురి లత(36)-రమేష్ దంపతులు బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. చందానగర్ హుడాకాలనీలోని వర్మహైట్స్‌లో ప్రస్తుతం నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

గత కొన్ని రోజులుగా మాధురి సోదరుడు వీరింట్లోనే ఉంటున్నాడు. ఇటీవల పండగ కోసం స్వగ్రామానికి వెళ్లి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే చేదువార్త తెలిసింది. సోదరి మాధురిలత ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం తెలియడంతో రోదిస్తూ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే మాధురిలత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ సోదరుని శోకం చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలు అమ్మ ఎక్కడ అని అడిగితే ఏం చెప్పాలంటూ బోరున విలపించాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని అతను పోలీసులకు చెప్పాడు. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img