Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.. 150 మందికి పైగా పార్టీలో చేరారు

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.. 150 మందికి పైగా పార్టీలో చేరారు

ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఎమ్మెల్యే విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా కండువాలు కప్పి 150 మందికి పైగా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. బుగ్గారం మండలం యశ్వంత్రావుపేట నుండి మాజీ సమన్వయ అధ్యక్షుడు సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో యశ్వంత్ రావు పేట గ్రామస్తులు 100 మంది, మరియు చెక్కలగ్రామము నుండి సురేందర్రావు ఆధ్వర్యంలో 30మంది వెలిగొండ నుండి కొంతమంది మొత్తానికి 150కీ పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విప్పు లక్ష్మణ్ కుమార్ బుగ్గారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఆధ్వర్యంలో మాజీ సమన్వయ అధ్యక్షుడు సత్యనారాయణ రావు కోల గంగయ్య కోలా పెద్ద మల్ల య్య బండారి మహేష్ కోల రాజేశం అరికల తిరుపతి నక్క గంగ ధరి, చెకల్ల సురేందర్ రావు ఆధ్వర్యంలో రమేష్ గౌడ్, రాజన్న గౌడ్, వెలుగొండ బిల్లా, సంపంగి కనకయ్య నక్క గంగయ్య సంపంగి ఎల్లయ్య సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img