దేశరాజధాని దిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అలీపూర్ ప్రాంతంలో గల కార్నివాల్ బాంక్వెట్ హాల్లో శుక్రవారం(మే 24) మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాంక్వెట్ హాల్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
కనీసం 50 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ, ప్రాణాపాయం సంభవించలేదు.