Chhattisgarh : వేసవికాలం కావడంతో దేశంలో అగ్ని ప్రమాదాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా ఛత్తీస్గడ్ రాయ్పూర్ కోట పరిసర ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ సరఫరా కంపెనీలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.