Homeహైదరాబాద్latest News4వ డివిజన్ లో మేయర్ పర్యటన

4వ డివిజన్ లో మేయర్ పర్యటన

ఇదేనిజం, కరీంనగర్: కరీంనగర్ లోని 4వ డివిజన్ లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సోమవారం పర్యటించారు. నగర అభివృద్ధిలో భాగంగా హుస్సేనిపురలో సీసీ రోడ్డు, ఓపెన్ డ్రైన్ ఫెన్సింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కాలనీలోని సమస్యలను తెలుసుకున్నారు. నల్లా నీళ్లు లీకవుతున్న ప్రాంతాన్ని చూసి, దానిని సరి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక సమస్యలను మేయర్ దృష్టికి తేగా, పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నుజ్హత్ ఫరీన్ అలీబా, ఎంఐంఎ 4వ డివిజన్ అధ్యక్షుడు సాజిద్ మాజిద్, బీఆర్ఎస్ నాయకులు నిజాముద్దీన్ షఫీ, ఎంఐఎం నాయకులు సుధాకర్, మిర్జా మతీన్ అలీ బేగ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img