హైదరాబాద్: నటి సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
చిరు కూల్ లుక్ చూసి నెటిజన్లు.. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్లు పెడ్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సీఎం కేసీఆర్ ని కలిసిన సినీ బృందం కలిసింది. అనంతరం చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ప్రకటించి హల్చల్ చేసిన విషయం తెలిసందే.
తప్పుడు కిట్ కారణంగా ఫలితం తప్పుగా వచ్చినట్లు వైద్యులు దృవీకరించినట్లు తర్వాత చిరు ప్రకటించారు.
ప్రస్తుతం కరోనా గందరగోళం నుంచి తేరుకున్న చిరు త్వరలోనే ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అతి త్వరలో చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.