త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ను విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదు. ఆగష్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథలో కోట్లలో అవినీతి జరిగింది’ అని ఆరోపించారు.