Homeహైదరాబాద్latest Newsఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు

ఇదే నిజం, నలగొండ టౌన్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు,వారి సతీమణి శ్రీమతి కోమటిరెడ్డి సబిత రెడ్డి ది నల్లగొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 114 పోలింగ్ బూత్ లో తమ ఓటు ను వినియోగించుకున్నారు. మంత్రి గారితో పాటు కూతురు శ్రీనిధి రెడ్డి గారు,అల్లుడు ప్రణవ్ రెడ్డి పోలింగ్ బూత్ 108 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక ఆయుధమని.. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దంపతులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి- చైతన్య, మేరేడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img