హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా తీవ్ర కృషి చేస్తుంది. ఐటీ హబ్గా అప్గ్రేడ్ అవుతున్న హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ అంతరాయం అడ్డంకుగా మారింది. దీన్ని అధిగమించేందుకు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం, బైరామల్గూడ జంక్షన్లో రూ.26.45 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంబించారు. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో పలు ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంబిస్తున్నారు. ఫ్లైఓవర్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మరియు తదితరులు పాల్గొన్నారు.