Homeహైదరాబాద్ఫ్లైఓవర్​ ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

ఫ్లైఓవర్​ ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​ మహానగరంలో ట్రాఫిక్​ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొంత కాలంగా తీవ్ర కృషి చేస్తుంది. ఐటీ హబ్​గా అప్​గ్రేడ్​ అవుతున్న హైదరాబాద్​ నగరానికి ట్రాఫిక్​ అంతరాయం అడ్డంకుగా మారింది. దీన్ని అధిగమించేందుకు వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్​ఆర్​డీపీ)లో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం, బైరామల్​గూడ జంక్షన్​లో రూ.26.45 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్​ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంబించారు. గత కొద్ది రోజులుగా టీఆర్​ఎస్​ ప్రభుత్వం నగరంలో పలు ఫ్లైఓవర్​ల నిర్మాణం చేపట్టి మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ప్రారంబిస్తున్నారు. ఫ్లైఓవర్​ ప్రారంబోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మరియు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img