Homeఫ్లాష్ ఫ్లాష్Missing:ఊక చెట్టు వాగులో ముగ్గురి గల్లంతు

Missing:ఊక చెట్టు వాగులో ముగ్గురి గల్లంతు

Missing :

  • మృతుల్లో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు
    వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊక చెట్టు వాగులో శనివారం సాయంత్రం ముగ్గురు గల్లంతయ్యారు. దేవరకద్ర మండలం కౌకుంట్ల కు చెందిన సంతోషమ్మ (35), ఆమె కుమార్తె పరిమళ (18) దసరా పండుగ కోసం తమ అక్క గారి ఊరు అయిన కొత్తకోటకు ఇటీవల వెళ్లారు. పండగ ముగియడంతో శనివారం సాయంత్రం వారి స్వగ్రామానికి మదనాపూర్ కు చేరుకొని అక్కడి నుంచి రైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.. అక్కడ కూడా నీటి ప్రవాహాలు ఉన్నాయి.. నేనే వచ్చి మోటార్ సైకిల్ పై దిగబెడుతానని సంతోష్ అమ్మ అక్క కుమారుడు సాయికుమార్ (25) తన మోటార్ సైకిల్ పై తీసుకొని ప్రయాణం అయ్యాడు. ఇటీవల వర్షాలు తీవ్రంగా కురిసిన నేపథ్యంలో సరళ సాగర్ నుండి వరద, ఇతర ప్రాంతాల నుండి వచ్చే నీరు కలిసి నీటి ప్రవాహం తీవ్రత కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాకపోకల నియంత్రణకు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు తమ అవసరాల నిమిత్తం ఆ వాగు మీద నుండి రాకపోకలు సాగిస్తున్నారు. పోలీసులు వద్దని వారించిన పలువులు వినకుండా వాహనాల మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. తాము కూడా సురక్షితంగా వాగు దాటుతామని భావించి ముందుకు సాగారు. చూస్తూ ఉండగానే వాహనం అదుపుతప్పి వాగులో పడిపోయింది . ఈ సంఘటనలో సంతోషమ్మ, పరిమళ, సాయికుమార్ ను కాపాడేందుకు కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజన లేకపోయింది. విషయం తెలిసిన వెంటనే మదనాపూర్ ఎస్సై మంజునాథ్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను అంచనా వేశారు. చీకటి కావడంతో మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నాలను నిలిపివేశారు.నెల రోజుల క్రితం ఇదే వాగులో ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేసే లెక్చరర్ గల్లంతైన విషయం మరవకముందే. ఈ సంఘటన చోటు చేసుకున్నది

Recent

- Advertisment -spot_img