Homeహైదరాబాద్latest NewsCivils : తరుణ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

Civils : తరుణ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే

ఇదే నిజం, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లీ గ్రామానికి చెందిన తరుణ్ UPSC పరీక్ష లో 231 ర్యాంక్ సాధించి IAS గా ఎన్నికయ్యాడు. విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారి స్వగ్రామానికి వెళ్ళి సన్మానం చేశారు. పరిగి నియోజకవర్గానికి గొప్ప పేరు తెచ్చారని, తరుణ్ ను ఆదర్శంగా తీసుకుని అందరూ ఉన్నత శిఖరాలు చెరేలా యువత ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గతంలో తన సహకారం తో ఏర్పాటు చేసిన VJIT కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుకొని తన లక్ష్యాన్ని చేరుకున్న తరుణ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.పేదరికం అందరికీ అడ్డు కాదని తన వంతు సహాయంగా 50వేల రూపాయలు ఇచ్చారు. ఈ కార్య్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పెంటయ్య, అమ్రది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img