Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్.

ఇదే నిజం, దేవరకొండ: డిండిమండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన బోడ బాలయ్య యాదవ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై హైదరాబాదులోని బి.యన్.రెడ్డి మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని దేవరకొండ ఎమ్మెల్యే గురువారం ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబానికి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే తో పాటు డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, గోవర్ధన్ రావు, గెలవలయ్య,భరత్ కుమార్, శరత్ కుమార్, నాగరాజు, శంకర్ ,వెంకటయ్య తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img