ఇదే నిజం బొల్లారం: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని వైయస్సార్ కాలనీలో గల పూరి జగన్నాథ్ ఆలయాన్ని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి బాల్రెడ్డి పార్టీ కౌన్సిలర్లు నాయకులు మహిళలు, పట్టణ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.