HomeSocial Mediaతెలంగాణలో దారుణం.. కుమారుడి మరణం తట్టుకోలేక తల్లి మృతి

తెలంగాణలో దారుణం.. కుమారుడి మరణం తట్టుకోలేక తల్లి మృతి

మెదక్‌ (Medak) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హవేలిఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. కుమారుడి మరణవార్త తట్టుకోలేక తల్లి మరణించారు. గ్రామానికి చెందిన నరసింహగౌడ్‌ (36) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌లో చనిపోయారు.

విషయం తెలుసుకున్న అతని లక్ష్మి(57) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. నరసింహగౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, గంట వ్యవధిలోనే తల్లీకొడుకుల మృతితో కుచన్‌పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Recent

- Advertisment -spot_img