Homeహైదరాబాద్latest Newsఓ తల్లి కడుపుకోత.. వినూత్న రీతిలో నిరసన..!

ఓ తల్లి కడుపుకోత.. వినూత్న రీతిలో నిరసన..!

శ్రీకాకుళం జిల్లాలో ‘ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన మురళి, నిరోషా దంపతులకు సాయివినీత్ (12) అనే కొడుకు ఉన్నాడు. సాయివినీత్‌కు పాము కరవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ముళ్లు గుచ్చుకుందని వైద్యులు వైద్యం చేయలేదు. దాంతో ఆ యువకుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో వల్లే కొడుకు మృతి చెందాడని తల్లి నిరసన చేపట్టింది.

ఫ్లెక్సీలో ఏముందంటే.. మే 21 తేదినా టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యసిబ్బంది నిర్ల లక్ష్యం కారణం, నిండుప్రాణాన్ని బలితీసుకుని, ఓ తల్లికి 12 ఏళ్ల కుమారుని దూరం చేసి కడుపుకోత మిగిల్చిన మీకు నా కొడుకుతో పాటు శ్రద్ధాంజిలి. అయ్యా వైద్య శాఖ కమీషనర్ గారు, సరైనా సమయానికి ఆసుపత్రికి తెచ్చినా, రెండు గంటల సమయాన్ని వృధా చేసి పరిస్థితి విషమించినది అని, బలగ ఆసుపత్రి రిఫర్ చేసి మార్గమద్యంలో నా కొడుకు మరణానికి కారణమైన వైద్యసిబ్బందిపై ఎటువంటి చర్య తీసుకుంటారో… మీ విన్నపానికే విడిచిపెడుతున్నాను అని రాస్తుంది.

Recent

- Advertisment -spot_img