Homeహైదరాబాద్mp arvind: ‘సేవ్ బీజేపీ’

mp arvind: ‘సేవ్ బీజేపీ’

  • నిజామాబాద్ లో అర్వింద్ వ్యతిరేకంగా నిరసన
  • కాషాయపార్టీలో పెరుగుతున్న అసమ్మతి

mp arvind: ఇదేనిజం, నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై రోజురోజుకు అసమ్మతి పెరిగిపోతున్నది. ఇటీవల ఆయన నిజామాబాద్ జిల్లాలో 13 మంది మండలాధ్యక్షులను ఏకపక్షంగా మార్చిన విషయం తెలిసిందే. దీంతో వారంతా కోపంగా ఉన్నారు.

ఇప్పటికే ఓ సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి నిరసన గళం వినిపించారు. తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. నిజామాబాద్ లోని బీజేపీ జిల్లా ఆఫీసు ఎదుట నిరసన చేపట్టారు. ‘సేవ్ బీజేపీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జిల్లాల్లో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. గతంలో కాంగ్రెస్ లో ఇలాంటి గొడవలు ఉండేవి, ఇప్పుడు బీజేపీలో కూడా ఇవి కామన్ గా మారాయి. నిజామాబాద్ విషయానికొస్తే.. మాజీలుగా మారిన మండల పార్టీ అధ్యక్షులు అర్వింద్ కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

Recent

- Advertisment -spot_img