Homeతెలంగాణఅమిత్ షాతో ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ.. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల..?

అమిత్ షాతో ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ.. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల..?

మల్కాజిగిరిలో భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ కీలక నేత అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఇందులో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో అధ్యక్ష పదవీ బాధ్యతలు ఈటల రాజేందర్ కు కట్టబెడతారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో స్టేట్ చీఫ్ బాధ్యతలు ఈటల చేపట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమిత్‌షాను నేడు ఈటల రాజేందర్ కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Recent

- Advertisment -spot_img