HomeసినిమాNag Ashwin : మేకిన్ ఇండియా సినిమాగా చేయాలనుకున్నా..!

Nag Ashwin : మేకిన్ ఇండియా సినిమాగా చేయాలనుకున్నా..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ కాస్ట్లీమూవీ ‘కల్కి.. 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ నాగ్ అశ్విన్ డెరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ‘ప్రాజెక్ట్ కే’గా స్టార్ట్ అయ్యి గ్రాండ్​గా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో దర్శకుడు నాగ్​ అశ్విన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్​ వైరల్​గా మారాయి. క‌ల్కి 2898 ఏడీ సినిమా వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ గురించి హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ యానిమేష‌న్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ కల్కి సినిమాకు వీఎఫ్​ఎక్స్ అంతా ఇండియాలోనే చేయిద్దాం అనుకున్నా. మేకిన్ ఇండియా సినిమాగా తీయాలకున్నా. కానీ కొన్ని కారణాలు వల్ల కుదరలేదు. క‌థ‌, సినిమా గ్రాఫ్‌తో పాటు ఎక్స్​పెక్టేషన్స్ కార‌ణంగా హాలీవుడ్ కంపెనీస్‌తో క‌లిసి గ్రాఫిక్స్ వ‌ర్క్ చేయాల్సి వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వ‌ర్క్ ఇండియాలోనే చేశాం. యానిమేష‌న్‌, గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్ విష‌యంలో భ‌విష్య‌త్​లో హాలీవుడ్ సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థ‌లు ఇండియాలోనే ఉన్నాయి.’ అని నాగ్​ అశ్విన్ తెలిపాడు.అలాగే ఇక నెక్స్ట్ తన సినిమాకి మాత్రం పూర్తిగా ఇండియా టాలెంట్​తోనే బెటర్ వీఎఫ్​ఎక్స్ డిజైన్ చేసిన కంప్లీట్ మేకిన్ ఇండియా ప్రాజెక్ట్​ చేస్తానని తెలిపాడు. అయితే, కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్ అండ్ టీం స్టార్టింగ్ నుంచే ఎన్నో విభాగాల్లో ఇండియా వైడ్​గా ఎంతో మంది టాలెంట్​ను ఆడిషన్ చేసిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img