హైదరాబాద్ః భారీ బడ్జెట్ సినిమాలు ఇటీవల కామన్ అయిపోయాయి. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్లో రానున్నసైంటిఫిక్ సినిమాకు భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుండి ఈ సినిమా పాన్ వరల్డ్ అని చెబుతూన్న చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఆ మేరకు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ని ప్లాన్ చేసినట్టు సమాచారం.
టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో సాగే ఈ కథ అత్యంత భారీగా తెరకెక్కుతోందట. ఆదిపురుష్ చిత్ర షూటింగ్ పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ తో సినిమా మొదలవుతుందని సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమా. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి కూడా రూ.500కోట్ల వరకు పెడుతున్నారట.