Homeజిల్లా వార్తలుఏబీవీపీ పి.ఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

ఏబీవీపీ పి.ఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: పి.ఏ పల్లి మండల కేంద్రం లో ఉన్నటువంటి పలు పాఠశాలల మరియు కళాశాలలో మంగళవారం ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఘనంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మరియు మోడల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సభ్యుడు యలమల గోపీచంద్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 75 ఏళ్లుగా ఎన్నో విద్యారంగ సమస్యల పట్ల పోరాటం చేస్తూ వస్తున్నదని కళాశాలలో మౌలిక వసతులు కావొచ్చు, ఫీజు రీయింబర్స్, హాస్టల్స్ సమస్యలు ఆకాడమిక్ సమస్యలు ఇలా విద్యార్థుల భవిష్యత్ కోసం అనునిత్యం కృషి చేస్తున్నదని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన పరిషత్ నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ నలుమూ లలా విస్తరిస్తూ 50 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోందని తెలిపారు. గడిచిన 75 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తూ మరెన్నో విజయాలను చూసిందని అనేక రకాల రంగాలలో విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ అందిస్తూనే దేశవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ పెద్దన్న పాత్ర పోషించిందని రాష్ట్ర సాధనకు అనేక వినూత్న కార్యక్రమాలు చేసి లు చేసి విద్యార్థి లోకాన్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని నిస్వార్థంగా ఉద్యమం వైపు నడిపించిన ఘన చరిత్ర ఏబీవీపీ సొంతమని గుర్తు చేశారు.. ఈకార్యక్రమంలో దేవరకొండ నగర జాయింట్ సెక్రెటరీ కటికల ఈశ్వర్, దేవరకొండ ఎం కె ఆర్ డిగ్రీ కళాశాల అధ్యక్షుడు దామోజీ అమితేష్, శివ, సాయి, అఖిల్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img