Homeహైదరాబాద్latest Newsజీవన్ రెడ్డి తో జరిపిన చర్చలు సఫలీకృతం.. ఇకపై ఇలాంటి తప్పు జరగదని హామీ..!

జీవన్ రెడ్డి తో జరిపిన చర్చలు సఫలీకృతం.. ఇకపై ఇలాంటి తప్పు జరగదని హామీ..!

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నాయకత్వములో ముందుకు వెళ్తుంది. చర్చలు సఫలం కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దిపదాస్ మున్షీ గారితో మరియు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే. సీ వేణుగోపాల్ గారితో కలిసి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారితో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయని, ఇక పై పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డి గారితో కలిసి చర్చించి తీసుకుంటామని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నాయకత్వములో ముందుకు వెళ్తుందనీ, పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందనీ సమావేశం అనంతరం వారు స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి గారితో దిపదాస్ మున్షీ, కే.సీ వేణుగోపాల్ గారితో జరిపిన చర్చలు సఫలం కావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు గారు మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img