ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. ఎఫ్55 పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఫ్రంట్, రేర్ కెమెరాల్ 50 ఎంపీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మూడు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ బేస్ వేరియంట్ – రూ.26,999, 8జీబీ+256జీబీ వేరియంట్ – రూ.29,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్ – రూ.32,999 గా ఉన్నాయి. ఈరోజు (మే 28 ) నుంచే ఫ్లిప్కార్టులో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. లాంఛ్ ఆఫర్ కింద 31వ తేదీలోపు కొనుగోలు చేసే వారికి 45W అడాప్టర్ను రూ.499కే విక్రయించనున్నారు. లేదంటే ఫిట్3 స్మార్ట్వాచ్ను రూ.1999కే కొనుగోలు చేయొచ్చు.