హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి.
కానీ తెలంగాణలో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం.
తాజాగా గడిచిన 24 గంటల్లో 565 కరోనా కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 106, రంగారెడ్డి జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా తో ఒకరు మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,70,833కు చేరింది. 1,462 మంది మరణించారు.
ప్రస్తుతం తెలంగాణలో 9,266 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది.