హైదరాబాద్ః ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిధి తాజాగా మరో విషయాన్ని తన ఫాలోవర్లతో పంచుకుంది.
లాక్డౌన్ పీరియడ్ కొందరు సినీ సెలబ్రిటీలు పెండ్లీలు చేసుకున్నారని, మరికొందరు రిలేషన్షిప్ మెయింటెయిన్ చేశారు. కానీ తాను మాత్రం ఈ రెండు కేటగిరీల్లో లేనంటుందీ ఇస్మార్ట్ నిధి.
లాక్ డౌన్ పీరియడ్ తన సింగిల్ స్టేటస్ ఏం మార్చలేదని చెప్పింది. లాక్డౌన్లో తాను రొమాంటిక్ రిలేషన్షిప్ కోసం ప్రయత్నించలేదని నిర్మోహమాటంగా తెగేసి చెప్పింది.
ఓ తెలుగు స్టార్ యాక్టర్ తో డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను సైతం కొట్టిపారేసింది.
ఈ బ్యూటీ ప్రస్తుతం అశోక్ గల్లా డెబ్యూట్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శింబుతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.