Homeహైదరాబాద్latest Newsరీల్ లోనే కాదు రియల్ హీరో కూడా

రీల్ లోనే కాదు రియల్ హీరో కూడా

మెగా హీరోలలో సాయిధరం తేజ్ రూటే సెపరేట్. కొత్త కథలతో ఎప్పటి కప్పుడు మెగాఫాన్స్ ను మెప్పిస్తుంటాడు. బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ చేస్తున్నాడు. యాక్సిడెంట్‌ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్‌ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్‌ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చిందని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్‌ తేజ్‌ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్‌ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్‌ మీడియా ద్వారా చెప్పాడు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా‌ గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img