Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తాం

చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌ జిల్లా వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు నోటీసులు జారీ చేస్తామని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.

కేసును దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు అనంతరం చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరోనా మ్యుటేషన్‌ ఎన్‌440కే వైరస్‌ ఉందంటూ చంద్రబాబు ప్రజలను భ్రయబ్రాంతులకు గురిచేశారని ఆయనపై ఫిర్యాదు అందిందని తెలిపారు.

న్యాయ‌వాది సుబ్బ‌య్య ఫిర్యాదుతో కేసు న‌మోదు చేశామన్నారు.

ఫిర్యాదును అనుస‌రించి చంద్ర‌బాబుపై ఐపీసీ 155, 505(1)(బీ)(2) సెక్ష‌న్ల కింద అదేవిధంగా 2005 ప్ర‌కృతి వైప‌రీత్యాల చ‌ట్టం సెక్ష‌న్‌-4 కింద కేసు న‌మోదు చేశామని చెప్పారు.

కాగా.. ఐదు రోజులక్రితం టీడీపీ ముఖ్య నేత‌ల‌తో ఆన్‌లైన్ ద్వారా స‌మావేశ‌మైన చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఇతర వైరస్‌ల కంటే అత్యంత ప్రమాదకరమైంద‌న్నారు.

వైరస్ కొత్త మ్యుటేషన్‌ ఎన్ 440కే ఏపీలో వ్యాపించిందని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img