HomeసినిమాOTT News : ఓటీటీలోకి వచ్చేసిన ‘పోలిమేర –2’

OTT News : ఓటీటీలోకి వచ్చేసిన ‘పోలిమేర –2’

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ మెయిన్ లీడ్​లో నటించిన రీసెంట్ మూవీ ‘మా ఊరి పొలిమేర – 2’. రెండేండ్ల కిందట వచ్చిన పోలిమేర సినిమాకు సీక్వెల్​గా దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గత నెల థియేటర్లలో రిలీజై పెద్ద హిట్టు కొట్టింది. పోలిమేర ఫస్ట్​ పార్ట్ నేరుగా హాట్​ స్టార్​లో రిలీజై పాజిటివ్ తెచ్చుకోగా.. సెకండ్​ పార్ట్​ను మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేసి పెద్ద సక్సెస్​ను అందుకున్నారు. ప్రస్తుతం పోలిమేర–2 ఓటీటీ ఆడియెన్స్​ను అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘ఆహా’ స్ట్రీమింగ్ యాప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీని థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img