Homeజిల్లా వార్తలుజీవితంలో సవాళ్లని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరాలి

జీవితంలో సవాళ్లని అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరాలి

-ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు
-యూటీఎఫ్ మండల అధ్యక్షులు బండ శ్రీనివాస్

ఇదేనిజం, లక్షెట్టిపేట: జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను అధిగమించినప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులు బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, పతాకాన్ని జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి ఆవిష్కరించారు. అనంతరం కళాశాలలో మద్యం, డ్రగ్స్, మత్తు పానీయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మత్తుకు, డ్రగ్స్ అలవాటు పడిన వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కారుకూరి సురేందర్, ప్రిన్సిపల్ విజిత్, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img