Homeతెలంగాణpalamuru:పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్టే..

palamuru:పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్టే..

– ఇప్పటికే 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి
– మంత్రి నిరంజన్ రెడ్డి

ఇదేనిజం, హైదరాబాద్​: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులతో ఇక పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రయత్నాలతో ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయని చెప్పారు. రెండేళ్ల క్రితమే ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందాల్సి ఉన్నదని, అయితే ఓవైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్ణీత సమయంలో పూర్తి కాలేకపోయిందని వెల్లడించారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తిచేశామని, త్వరలో నీళ్లివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మిగిలిన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటిని విడుదల చేయనున్నామని వెల్లడించారు. సీఎం ఇచ్చిన మాటప్రకారం కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు ప్రజల కాళ్లను తడుపుతామన్నారు. ఆ కల త్వరలోనే నెరవేరబోతున్నదని చెప్పారు. 60 ఏండ్లుగా జిల్లా ప్రజల పడుతున్న వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతున్నది తెలిపారు. ఆ సమయం కోసం రైతులు, ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు పేర్కొన్నారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు అనుమతుల కోసం నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహానికి, ముందుచూపునకు ఇది ప్రతీక అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అనేది అనితర సాధ్యమైన పని, అది కేసీఆర్‌కే సాధ్యమయిందన్నారు.

Recent

- Advertisment -spot_img