HomeసినిమాPallavi Prashanth : పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నాను

Pallavi Prashanth : పారిపోలేదు.. ఇంట్లోనే ఉన్నాను

– బిగ్​బాస్​ విన్నర్​ పల్లవి ప్రశాంత్​ ప్రకటన

ఇదేనిజం, హైదరాబాద్​: బిగ్​ బాస్​ విన్నర్​ పల్లవి ప్రశాంత్​ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. పోలీసులకు సైతం అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వార్తలపై తాజాగా ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. గత ఆదివారం బిగ్​ బాస్​ విన్నర్​ గా ప్రశాంత్​ ను ప్రకటించిన అనంతరం అన్న పూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఇతర కంటెస్టెంట్ల మీద పల్లవి ప్రశాంత్​ ఫ్యాన్స్​ దాడి చేశారు. కొన్ని కార్లు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల ఆద్దాలు సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతని సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతని స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. ఎ-4గా ఉన్న ఉప్పల్‌ మేడిపల్లికి చెందిన లాంగ్‌ డ్రైవ్‌ కార్స్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్‌ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను అరెస్ట్‌ చేశారు. కాగా అప్పటి నుంచి ప్రశాంత్​ కనిపించడం లేదని.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని ఇన్​ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఇంట్లోనే ఉన్నానని తెలిపాడు. తాను ఏ తప్పూ చేయలేదన్నాడు. రియాల్టీ షో నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫోన్‌ వాడలేదని చెప్పాడు.

Recent

- Advertisment -spot_img