పార్లమెంట్ పాత భవనంలో ఎన్డీయే ఎంపీలు భేటీ అయి.. మోదీని ఏకగ్రీవంగా తమ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ. మన సమక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. ఎన్డీయే అంటే ఒక విజయవంతమైన పరిపాలన కొనసాగిస్తోంది. ఏపీలో ప్రజలు మాకు అతిపెద్ద బహుమతి ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.. కానీ అంతే త్వరగా ప్రజల నుంచి ఆదరణ కోల్పోయాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఎన్డీయేను ఆదరించాయన్నారు.