Homeహైదరాబాద్latest Newsవారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: MLA Arekapudi Gandhi

వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: MLA Arekapudi Gandhi

ఇదేనిజం, శేరిలింగంపల్లి: పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్ లో  చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో భాగంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల  విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..  రాబోయే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో  బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి  ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ ను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని సూచించారు.కార్యక్రమంలో ఎమ్మేల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ  దాయనంద్ గుప్తా  , చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి  కాసాని జ్ఞానేశ్వర్  కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,జూపల్లి సత్యనారాయణ ,నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి ,మాధవరం రోజాదేవి రంగారావు మాజీ కార్పొరేటర్ సాయి బాబా,బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img