ఇదే నిజం, కొమురం భీం ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా లోని చింతల మానేపల్లిలోకి ప్రవేశించిన ఒక ఏనుగు ఇప్పటివరకు ఇద్దరి మృతి కి కారణమైనట్టుగా జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ తెలియజేశారు.
చింతలమానపల్లి, పెంచికల్ పేట్, దహెగాం, బెజ్జుర్ చుట్టుక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా చేను, పొలాల వైపు వెళ్లకూడదని తెలియజేశారు. ఒంటరిగా ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రాకూడదన్నారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఏనుగు జాడ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.