ఇదేనిజం, జగదేవపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, లోక్సభ ఎన్నికల్లో కూడా అదే రిపీటా అవుతుందని జోస్యం చెప్పారు.
జగదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున ఆలయ ప్రతిష్ట ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను దీవించాలని స్వామివారిని మొక్కుకున్నట్టు తెలిపారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ ని శాలువాలు కప్పి సత్కరించారు.కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.