ప్రాణాలను కాపాడటానికి ముందుకు వచ్చిన యోధులు దైవ సమానులు అని ప్లాస్మా దాతలను ఉద్దేశించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఒకటిన్నర నెల నుంచి ఈ యజ్ఞం చేపట్టామన్నారు. ఇప్పటికి 5,300 బ్లడ్ యునిట్లు సేకరించినట్లు, 761 మంది నుంచి ప్లాస్మా దానంతో 1350 మంది కరోన రోగుల్ని కాపాడినట్లు తెలిపారు. ఐటీ పరిశ్రమ, పోలీసులు, ప్రజల నుంచి ప్లాస్మా దానానికి మంచి స్పందన వచ్చిందని, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు సైబరాబాద్ పోలీసులు ఆదర్శం అన్నారు.