– స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్
ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం తెలిపారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని పాలమూరుకు బయలుదేరారు.