- దాడిచేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
- బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్
- కోర్టు విధులు బహిష్కరించి నిరసన
ఇదేనిజం, లక్షెట్టిపేట: ఇటీవల జనగామ పోలీస్ స్టేషన్లో ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కోర్టు ఆవరణలో విధులు బహిస్కరించిన అనంతరం నిరసన తెలియ జేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… రక్షించాల్సిన పోలీసులే ఒక న్యాయవాదులు అని చూడకుండా దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ రాజేశ్వర్, రాజేశ్వర్ రావు, భూమారెడ్డి, కొమిరెడ్డి సత్తన్న, సురేందర్, శ్రీధర్, నళినికాంత్, ప్రదీప్, షఫీక్, తిరుపతి, ఆఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.