Homeజిల్లా వార్తలుబెల్లంపల్లిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

బెల్లంపల్లిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్​ కమిషనర్​ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. ఏసీపీ సూచనల మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో ఎస్సై ప్రవీణ్, సిబ్బందితో కలసి పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్​ లైసెన్స్​ లేని వాహనాలు ఇన్స్యూరెన్స్​ లేని వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సీఐ బన్సీలాల్, ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img