ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఏసీపీ సూచనల మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ బన్సీలాల్ నేతృత్వంలో ఎస్సై ప్రవీణ్, సిబ్బందితో కలసి పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలు ఇన్స్యూరెన్స్ లేని వాహనాలను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో సీఐ బన్సీలాల్, ఎస్సై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.