Homeహైదరాబాద్latest Newsనాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా..

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా..

ఇదేనిజం, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించారు. నామినేషన్ వేసే ముందు భరత్ ప్రసాద్ అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ జక్క రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img