Homeజిల్లా వార్తలుపార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించాలి

పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపించాలి


పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
ఇదేనిజం, పటాన్​‌చెరు : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలిచే విధంగా ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశపడవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img