Homeహైదరాబాద్latest Newsఆ రోజు గొంతు తడారకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి : ప్రశాంత్ కిశోర్

ఆ రోజు గొంతు తడారకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి : ప్రశాంత్ కిశోర్

విమర్శలకు సమాధానంగా ప్రశాంత్ కిశోర్ X లో ఓ పోస్టు చేశారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. “జూన్ 4న మీ గొంతు తడి ఆరిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి” అని ఎద్దేవా చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ..ప్రశాంత్ కిశోర్ గతంలో చేసిన కొన్ని అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిన కొద్దిసేపటికే ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఎన్డీయే 400 మార్కు దాటుతుందని మోదీ చేస్తోన్న ప్రచారంపై ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..అది సాధ్యం కాదన్నారు. అలాగే 270 కంటే దిగువకు కూడా పడిపోదని వెల్లడించారు. తూర్పు, దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని..కానీ బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.

Recent

- Advertisment -spot_img