HomeEnglishసలార్​–2 పై పృథ్వీరాజ్​ క్రేజీ అప్​డేట్

సలార్​–2 పై పృథ్వీరాజ్​ క్రేజీ అప్​డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’. గతేడాది డిసెంబర్​లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. దేవాగా ప్రభాస్‌, వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ ఆకట్టుకున్నారు. సలార్ పార్ట్​2 ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్​ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘మరికొన్ని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. ‘సలార్‌2’ కచ్చితంగా 2025లో విడుదలవుతుంది. తేదీ మాత్రం దర్శకనిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సీక్వెన్స్‌లను పూర్తి చేయడానికి నేను ‘ఎల్‌2: ఎంపురాన్‌’ నుంచి కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకోవాలి’ అని చెప్పారు. దీంతో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img