టాలీవుడ్ నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ప్రియమణి-ముస్తఫారాజ్ ల వివాహం చెల్లదని ముస్తఫారాజ్ మొదటి భార్య అయేషా ఆరోపించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ముస్తఫారాజ్, అయేషా 2013లో విడిపోయారు. ఆ తర్వాత ముస్తఫారాజ్, ప్రియమణిని పెళ్లి చేసుకున్నాడు.
ముస్తఫారాజ్ ఇప్పటివరకు విడాకుల కోసం దరఖాస్తు పెట్టలేదని, తాను ఇప్పటికీ ముస్తఫారాజ్ భార్యనేనని అయేషా అంటోంది.
ముస్తఫారాజ్ తో నా వివాహ బంధం ఇప్పటికీ ఉంది. ముస్తఫారాజ్-ప్రియమణి పెళ్లి చెల్లదు. ప్రియమణిని పెళ్లి చేసుకున్నపుడు ముస్తఫా రాజ్ బ్రహ్మచారిని అని కోర్టులో చెప్పాడు.
అయితే తాము మాత్రం ఇప్పటివరకు విడాకులకు దరఖాస్తు చేసుకోలేదని అయేషా ఆరోపిస్తోంది. అయేషాకు ఇద్దరు పిల్లలు.
అయేషా ఆరోపణలు అబద్దం:
కాగా ఆమె ఆరోపణలపై ముస్తఫారాజ్ స్పందిస్తూ..నాపై అయేషా చేస్తున్న ఆరోపణలు అబద్దం.
నేను రెగ్యులర్ గా పిల్లల ఖర్చులను అయేషాకు అందజేస్తున్నా. ఆమె కేవలం నా నుంచి డబ్బు వసూలు చేయడానికి ఇలా ప్రయత్నిస్తుందన్నాడు.
అయేషా, నేను 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నాం. ఆమెకు 2013లో విడాకులు ఇచ్చాను. 2017లో ప్రియమణితో నా పెళ్లి అయింది.
మరి అయేషా ఇంతకాలం ఎందుకు టైం తీసుకుందని ముస్తఫారాజ్ ప్రశ్నించాడు. మరి అయేషా ఆరోపణలపై ప్రియమణి ఎలా స్పందిస్తుందో చూడాలి.