Homeతెలంగాణనియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి

నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే మర్రి

ఇదేనిజం, మల్కాజిగిరి: విద్యుత్ సరఫరాలో లోపాలను అధ్యయనం చేసి సరఫరా చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని తన కార్యాలయంలో గురువారం విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో స్వయంగా స్థానిక ప్రజలు, కాలనీవాసులు విద్యుత్ సంబంధిత సమస్యలపై ఎక్కువగా అభ్యర్థనలు వచ్చేవని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గం ప్రజల విద్యుత్ సమస్యల వినతుల పరిష్కారం కొరకు తక్షణ చర్యలకు అందుబాటులో ఉండేలా దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, DEసుభాష్, DEసుచిత్రనాథ్, ADEనాగరాజు, ADE శ్రీనివాస్ రెడ్డి, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, బద్దం పరుశురాం రెడ్డి, జీకే హనుమంత్ రావు, ఢిల్లీ పరమేష్, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img